ఆర్మూర్, నవంబర్ 4 : పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానని, లేదంటే రాజీనామా చేసి రైతు ఉద్యమంలో పాల్గొంటానని చెప్పి మాట తప్పిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్కు తగిన బుద్ధిచెప్తామని జగిత్యాల రైతు ఐక్య కార్యాచరణ కమిటీ, మెట్పల్లి రైతు ఐక్యవేదిక నాయకులు హెచ్చరించారు.
12ఏండ్లుగా పసుపు బోర్డు ఏర్పా టు కోసం పోరాడుతున్న ముత్యాల మనోహర్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ.. రైతాంగాన్ని విస్మరించి కార్పొరేట్ పెద్దలకు కొమ్ముకాస్తున్న బీజేపీని పాతరేద్దామని పిలుపునిచ్చారు.