Rythu Bheema | రామడుగు, ఆగస్టు 17 : కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్కు చెందిన బీజేపీ కిసాన్మోర్ఛా ఉపాధ్యక్షుడు చింతపంటి బాలు కుటుంబానికి రైతుబీమా మంజూరైంది. బాలు అనారోగ్యంతో రెండు నెలల క్రితం మర ణించాడు. ఆయన పేరిట వ్యవసాయ భూమి ఉండటంతో కుటుంబ సభ్యులు రైతుబీమాకు దరఖాస్తు చేసుకున్నారు.
గురువారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆయన కుటుంబానికి రూ.5 లక్షల రైతుబీమా ప్రొసీడింగ్స్ అందజేశా రు. అనంతరం రామడుగు మండలం రాంచంద్రాపూర్కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త లచ్చయ్య కొన్ని నెలల క్రితం ప్రమాదవశాత్తు కాలువలో మునిగి చనిపోగా ఆయన కొడుకు అజయ్కి రూ. రెండు లక్షల బీమాచెక్కు అందజేశారు.