నాకున్న నాలుగెకరాల భూమి సాగుకు ఇంతకు ముందు అరిగోస పడాల్సి వచ్చేది. విత్తనాలు, ఎరువులు ఎక్కడి నుంచి తేవాలనే భయం ఉండే. దుకాణపోళ్ల దగ్గరికి పదిసార్లు తిరిగితే కానీ విత్తనాలు, మందు బస్తాలు ఇచ్చేటోళ్లు కాదు. ఎక్కువ వడ్డీ తీసుకొనెటోళ్లు. పంటలు కూడా వాళ్లకే అమ్మాలనే షరతు ఉండే. రైతుబంధు వచ్చినకాడి నుంచి అప్పుల బాధలు తప్పాయి. చేతిలో డబ్బులు ఉండటంతో దుకాణానికి పోయి మాకు కావాల్సినవి కొంటున్నాం. ఇంతకుముందు ఒక పంట మాత్రమే వేసేటోన్ని. ఇప్పుడు వానకాలంలో పత్తి, సోయా, యాసంగిలో గోధుమ సాగు చేస్తున్న.
-తొడసం గోద్రు, గిరిజన రైతు, మచ్చాపూర్, గుడిహత్నూర్ మండలం, ఆదిలాబాద్ జిల్లా
రైతుబంధు అక్కరకొస్తున్నది
కేసీఆర్ సారు రైతుబంధు పెట్టి మంచి పనిజేసిండు. నాకు రెండెకరాల పొలం ఉన్నది. రైతుబంధు పైసలు ఎరువులు, ట్రాక్టర్ కిరాయిలు, కూలీలకు ఉపయోగపడుతున్నాయి. గతంలో పొలం సాగు చేయాలంటే గ్రామంలో ఉన్న పెద్ద సేట్ల దగ్గరికి వెళ్లి అప్పు తెచ్చుకునేటోన్ని. గిప్పుడు గా బాధ తప్పింది. ప్రతి సీజన్లో రైతుబంధు పైసలు అస్తున్నయి. ధైర్యంగా పంట పండిస్తున్న. సీఎం కేసీఆర్ సార్కు రైతులమంత రుణపడి ఉంటం.
–పొట్టిదాసు, రైతు, పొడ్చన్పల్లి, పాపన్నపేట మండలం, మెదక్ జిల్లా
లాగోడి కొనుగోలు చేస్తా
రైతుబంధు ద్వారా వచ్చిన డబ్బుతో పంటలకు లాగోడి కొనుగోలు చేస్తా. వరి పంటతోపాటు, పూలు, కూరగాయల పంటలు వేస్తున్నా. గతంలో లాగోడి కోసం అప్పులు చేస్తే, పంట చేతికొచ్చే వరకు వడ్డీలకు సరిపోయేది కాదు. ఇప్పుడు ప్రభుత్వ సహకారంతో రైతులు సంతోషంగా పంటలు సాగు చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా రైతులకు ఇలాంటి పథకాలు అందాలంటే కేసీఆర్తోనే సాధ్యం. ముఖ్యమంత్రి కేసీఆర్కు రైతులమంతా రుణపడి ఉంటాం.
–అచ్చిని అంజయ్య, రైతు అంతిరెడ్డిగూడ, షాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా
కేసీఆర్ దయ వల్ల ఎవుసం గిట్టుబాటయితాంది
తెలంగాణ రాక ముందు ఎన్నో కష్టాలు పడ్డం. ఇప్పుడు కేసీఆర్ సార్ దయ వల్ల రైతుబంధు టైంకు రెండు పంటలకు వస్తున్నది. ఆ పైసలతోనే విత్తనాలు, మందు బత్తాలు కొంటున్న. రైతుబంధు పైసలు అదునుకు బాగా అక్కరకు వస్తున్నాయి. అప్పుడు పడ్డ బాధలన్నీ పోయినయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మందు బత్తాలు, విత్తనాలు దొరుకుతున్నయి. కరెంటు రంది కూడా పోయింది. చెరువులు, కుంటలు మంచిగ చేసిళ్లు. బోరేత్తే మీదనే నీళ్లు పడతున్నయి. ఇప్పుడు పెట్టుబడి లేదని, కరెంటు వత్తలేదనే రంది లేదు. నాకు ఎనిమిది ఎకరాల భూమి ఉన్నది. ఇప్పుడు మంచిగ పంటలు పండిస్తున్న. నాలుగు రూపాయలు ఎనుకబడుతున్నయి. కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం.
–కాశవేన ఓదెలు, నాచారం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
మా బతుకులు దారినపడ్డయ్
నాకు 3.37ఎకరాల భూమి ఉన్నది. రైతుబంధు కింద రూ.19,625 వచ్చినయ్. అవి నాట్లు వేసే కూలీలకు అక్కరకొచ్చినయ్. వీటితోనే ఎరువులు తేవాలి. రైతుబంధు లేకముందు నాట్ల సమయంలో ఎరువులు ఉద్దెర తెస్తుంటిమి. నాటు కూలి, పెట్టుబడి కోసం షావుకారుల నుంచి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు మిత్తికి తెచ్చేది. సీఎం కేసీఆర్ పుణ్యమాని ఐదేండ్లుగా వడ్డీ తప్పింది. వ్యాపారుల దగ్గర పడిగాపులు పడే బాధలు తప్పినయ్. మా బతుకులు దారిన పడ్డయ్. ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నం. ఎనుకట వ్యవసాయం అంటే భయపడి బీళ్లుగా వదిలేసేవాళ్లం. ఇప్పుడు నాదే కాదు.. మా ఊరంతా పచ్చగా మారింది. మా రైతుల దీవెనలు ఎప్పుడూ ఆయనకే ఉంటయ్.
– కేశబోయిన జానయ్యగౌడ్, ఊట్కూరు,నిడమనూరు మండలం, నల్లగొండ జిల్లా