Rythu Bandhu | హైదరాబాద్ : తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి రైతులకు శుభవార్త వినిపించారు. రైతుబంధు కింద ఎకరానికి రూ. 10 వేల చొప్పున అందిస్తున్న ఆర్థికసాయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. రైతుబంధు కింద రూ. 16 వేలు ఇవ్వనున్నట్లు కేసీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటన సందర్భంగా కేసీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
రాష్ట్రంలో 60 నుంచి 70 శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగంపైనే ఆధారపడి బతుకుతున్నారు. ఎన్నో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుంది వ్యవసాయ రంగం. 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించే స్థాయికి ఎదిగాం. వ్యవసాయ స్థీరీకరణ విజయవంతం చేశాం. ఉత్పాదకతను పెంచుకుంటూ వ్యవసాయ రాష్ట్రంగా భవిష్యత్లో తెలంగాణ వెలుగొందాలి. రైతుబంధు పథకాన్ని రూ. 16 వేలకు పెంచుతున్నాం. ఇది కూడా మొదటి ఏడాది రూ. 12 వేలు పెరుగుతుంది. ప్రతి ఏడాది కొంత పెరుగతూ ఐదో ఏడాదికి రూ. 16 వేలకు చేరుకుంటుంది. ఒక పటిష్టమైన వ్యవసాయ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాం. అర్హులైన పేద మహిళలకు రూ. 3 వేల గౌరవ భృతి ఇవ్వాలని నిర్ణయించాం. బీపీఎల్ కార్డు కలిగిన వారికి వర్తిస్తాం. సౌభాగ్య లక్ష్మి పథకం కింద అమలు చేస్తాం అని కేసీఆర్ ప్రకటించారు.