హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా గత 5 రోజుల్లో రూ.56.43 లక్షల మంది రైతులకు రూ.4801.99 కోట్ల పెట్టుబడి సాయం రైతుబంధు రూపంలో అందింది. బుధవారం ఒక్కరోజే 4.44 లక్షల రైతులకు రూ.857.28 కోట్లు ఖాతాల్లో జమ అయ్యాయి. ఇప్పటి వరకు 96 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందించింది. మరోవైపు రైతుబంధు నిధులను బ్యాంకు రుణాల కింద జమ చేసుకోవద్దని రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి బ్యాంకర్లను కోరారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 43.31 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఈ సీజన్లో వరిసాగును రైతులు బాగా తగ్గించారు. మొత్తం సాగు విస్తీర్ణం అంచనాలో ఇప్పటివరకు 35% పంటలు సాగాయ్యాయి.