వనపర్తి, జూలై 14: రాష్ట్ర వ్యాప్తంగా 1.38 కోట్ల ఎకరాలకు రైతుబంధు పంపిణీ చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. 64.14 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,895.88 కోట్ల నిధులు జమ చేశామన్నారు. గురువారం ఆయన హైదరాబాద్ నుంచి పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సకాలంలో వచ్చిన రైతుబంధు డబ్బులను పెట్టుబడి కోసం ఉపయోగించుకోవాలని రైతులకు సూచించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండించాలన్నారు. కరోనా ఇబ్బందులు, కేంద్రం అడ్డంకులను అధిగమించి రైతుబంధు నిధులు పంపిణీ చేసినట్టు గుర్తుచేశారు. తొమ్మిదో విడత రైతుబంధు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.