హైదరాబాద్, డిసెంబర్ 27 : దేశంలోనే పల్లె ప్రగతి పథకం అద్భుత ఆవిష్కరణ అని, గ్రామ స్వరాజ్యానికి ఇది ప్రాణం పోసిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. రాష్ట్ర సాహిత్య అకాడమి చైర్మన్గా ఇటీవల పదవీ భాద్యతలు స్వీకరించిన జూలూరు గౌరీ శంకర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ను సోమవారం బీఆర్ కేఆర్ భవన్లో మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్బంగా జూలూరు గౌరీ శంకర్ రచించిన ‘పచ్చా పచ్చాని పల్లె’ అనే పుస్తకాన్ని సోమేశ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. పల్లె ప్రగతితో పల్లెల ముఖ చిత్రం మారిపోయిందన్నారు. పల్లెల ఆరోగ్యమే, దేశ సౌభాగ్యమని గుర్తించి స్వచ్ఛ భారత్ లో తెలంగాణా అగ్రస్థానంలో నిలవడం గర్వకారణమని పేర్కొన్నారు.
ప్రతి పల్లె సర్వ స్వతంత్ర కేంద్రంగా నిలవడానికి ముఖ్యమంత్రి దార్శనిక ఆలోచనా ఎంతో దోహదం చేసిందన్నారు. స్ఫూర్తి దాయక పుస్తకాన్ని రచించిన జూలూరి గౌరీ శంకర్ ను సీఎస్ సోమేశ్ కుమార్ అభినందించారు.