యాదాద్రి, జూలై 18: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి అనుబంధ ఆలయం పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి గర్భగుడిలోని స్ఫటిక లింగేశ్వరుడికి సోమవారం అర్చకులు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. సాయంత్రం రామలింగేశ్వరుడిని శివాలయ మాడవీధుల్లో ఊరేగించారు. లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు వైభవంగా జరిగాయి. ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. అన్ని విభాగాల నుంచి స్వామివారి ఖజానాకు రూ.14,91,034 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్ గీత తెలిపారు. అటు.. విమాన గోపురం స్వర్ణతాపడం కోసం హైదరాబాద్లోని బడంగ్పేటకు చెందిన భీమిడి పెద్ద నర్సింహా రెడ్డి రూ.1,11,456 విరాళం సమర్పించారు.