ఎల్బీనగర్, జూలై 5: గురు పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదక్షిణకు దిల్సుఖ్ నగర్ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు (RTC Special Bus) నడుపుతున్నది. జూలై 9 న రాత్రి 7 గంటలకు దిల్సుఖ్ నగర్ నుంచి బస్సు బయల్దేరుతుందని హైదరాబాద్-2 డిపో మేనేజర్ తెలిపారు. కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ మీదుగా అరుణాచలం చేరుకుంటుందని, తిరిగి జూన్ 11న మధ్యాహ్నం అరుణాచలంలో బయలుదేరి 12వ తేదీన ఉదయం 6 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుందని వెల్లడించారు. ఒక్కరికి టికెట్ చార్జీ రూ.3900 గా నిర్ణయించామని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
టికెట్ బుకింగ్ కోసం www.tgsrtcbus.in వెబ్సైట్ ద్వారా కానీ, దగ్గరలో ఉన్న ఏటీబీ ఏజెంట్ వద్ద కానీ రిజర్వేషన్ చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు ఫోన్ నంబర్లు.. 9959444165, 9346559649, 9666350995, 7382838010, 9959226249 సంప్రదించవచ్చని తెలిపారు.