మహబూబాబాద్, ఏప్రిల్ 01 : ఆదాయ మార్గాలను పెంచుకుని ఆర్టీసీని బలోపేతం చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ సజ్జనార్ ఆర్టిసీ సిబ్బందికి సూచించారు. శుక్రవారం మహబూబాబాద్ ఆర్టీసీ డిపో ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. శశాంక, అడిషనల్ ఎస్పీ యోగేష్ గౌతం, ఎమ్మెల్యే శంకర్ నాయక్ సజ్జనార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. డిపో నుంచి సర్వీసులు ఏయే ప్రాంతాలకు ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి, ఏ ప్రాంతంలో ఆర్టీసీకి లాభం, నష్టం వస్తున్నది వివరాలను అధికారులతో, సిబ్బందితో మాట్లాడి తెలుసుకున్నారు. ఆర్టీసీ పరిరక్షణతో పాటు, సిబ్బంది కార్మికుల సంక్షేమం మొదటి ప్రాధాన్యత లక్ష్యం అని తెలిపారు. డ్రైవర్లు, కండక్టర్ లు, సిబ్బంది కమిట్మెంట్తో పనిచేయాలని సూచించారు.
ఈ సందర్భంగా ఇంధనం పొదుపు చేసిన ఇద్దరు డ్రైవర్లు బి. గోపాల్, సుధాకర్కు జిల్లా కలెక్టర్ కె. శశాంక, అడిషనల్ ఎస్పీ యోగేష్ గౌతం చేతుల మీదుగా నగదు ప్రోత్సాహకం అందజేసి అభినందించారు.
కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ బి. శ్రీదేవి, డిపో మేనేజర్ బి. శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.