VS Sajjanar | తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు టీఎసీఆర్టీసీ పేరును టీజీఎస్ఆర్టీసీగా మార్చింది. అయితే, టీసీఎస్ఆర్టీసీ లోగో ఇదేనంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. కొత్త లోగో విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదన్నారు. టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న లోగో ఫేక్ అంటూ క్లారిటీ ఇచ్చారు.
ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదని.. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తుందని ఆయన తెలిపారు. కొత్త లోగోను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు టీఎస్ ఆర్టీసీ పేరును టీజీఎస్ఆర్టీసీగా మారుస్తూ మంగళవారం ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు టీఎస్ఆర్టీసీ పేరును టీజీఎస్ఆర్టీసీగా మార్చామని సజ్జనార్ పేర్కొన్నారు. ఈ మేరకు అధికారిక ఎక్స్ ఖాతాలు @tgsrtcmdoffice, @tgsrtchq గా మార్చామని.. సలహాలు, సూచనలతో పాటు ఫిర్యాదులను కొత్త సోషల్ మీడియా ఖాతాలో ఇవ్వాలని సూచించారు.
#TGSRTC కొత్త లోగో విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదు. టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో ప్రచారంచేస్తోన్న లోగో ఫేక్. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. కొత్త లోగోను సంస్థ… pic.twitter.com/n2L0rezuoo
— VC Sajjanar – MD TGSRTC (@tgsrtcmdoffice) May 23, 2024