గ్రీన్ ఇండియా చాలెంజ్ గుర్తింపు
హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ) : మొక్కలను నాటేలా ప్రోత్సహించడంలో తనవంతు పాత్ర పోషిస్తున్న టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్కు గ్రీన్ ఇండియా చాలెంజ్ సంస్థ వనమాలి బ్యాడ్జ్ను ప్రకటించింది. హరితహారం, గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ఆయన మొక్కలను నాటించడంలో విశేష కృషి చేస్తున్నారు.
ముక్కోటి వృక్షార్చనలో పాల్గొన్నందుకు గుర్తింపుగా సజ్జనార్కు ‘వనమాలి’ గౌరవ బ్యాడ్జ్, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ పేరిట ప్రశంసాపత్రాన్ని అందించారు. ఈ ప్రశంసపత్రాన్ని, హరితహారంలో పాల్గొన్న ఫొటోలను మంగళవారం సజ్జనార్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.