జగిత్యాల : ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే ఒకే ఒక సంస్థ టీఎస్ ఆర్టీసీ అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. శనివారం పట్టణంలోని కొత్త బస్టాండ్ లో ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ను ఆయన ప్రారంభించారు. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థను కాపాడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. నష్టాల్లో నడుస్తున్న సంస్థను ఆదుకుంటుందని తెలిపారు.
తెలంగాణ ఉద్యమం, సకల జనుల సమ్మెలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర మరువలేనిదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల వేతనాలను పెంచారని గుర్తు చేశారు. ఆర్టీసీ కార్గొ సర్వీస్లను ప్రారంభించండం వల్ల సంస్థకు లాభాలు వస్తున్నాయని వెల్లడించారు.
రూ. కోటితో జగిత్యాల కొత్త బస్టాండ్ ను అభివృద్ధి చేసుకున్నామని,పాత బస్టాండ్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని వివరించారు. ధర్మపురి వెళ్లే బస్ లకు నూతన బస్ షెల్టర్లనును ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.