సూర్యాపేట : రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడంలో కీలక భూమిక పోషించిన విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డికి సూర్యాపేట ఆర్టీసీ ఉద్యోగులు పుష్పగుచ్ఛాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ హైదరాబాద్ జోన్ జాయింట్ సెక్రటరీ సుంకరి శ్రీనివాస్ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్కు యావత్ ఆర్టీసీ ఉద్యోగులు రుణపడి ఉంటారని పేర్కొన్నారు.
సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డికి ఆర్టీసీ లోకం అన్నివేళలా అండగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎంయూ సీనియర్ నాయకులు బెజవాడ సీతారాములు, బెల్లి నరసయ్య, ఎంప్లాయిస్ యూనియన్ డిపో కార్యదర్శి ఎన్సీ సైదులు, నాయకులు చెరుకు వెంకటయ్య, యూసఫ్, ఎండీ జానీ, టి వీరయ్య, కె శ్రీధర్, టీబీ రావు, రేణుక, సిబ్బంది జక్కలి సైదులు, జానయ్య, శ్రీనివాస్ రెడ్డి, అంజి, నాగరాజు, ఉపేందర్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.