హుజూరాబాద్ టౌన్/చిగురుమామిడి, అక్టోబర్ 6: విధినిర్వహణలో ఉన్న ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు గుండెపోటుతో మృతిచెందారు. కరీంనగర్ జిల్లా సైదాపూ ర్ మండలం దుద్దెనపల్లికి చెందిన ఠాకూర్ రమేశ్సింగ్ (45) హుజూరాబాద్ డిపో లో డ్రైవర్గా పనిచేస్తున్నారు. 15 రోజుల క్రితమే పరకాల డిపో నుంచి డిప్యూటేషన్పై హుజురాబాద్కు వచ్చారు. ఆదివారం హుజూరాబాద్ నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా గజ్వేల్ సమీపంలోకి రాగానే గుండెపోటుకు గురయ్యారు. దీంతో బ స్సును పక్కకు ఆపి కండక్టర్, ప్రయాణికులకు చెప్పారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వచ్చి రమేశ్సింగ్ను గజ్వే ల్ దవాఖానకు తరలించగా అప్పటికే మృ తిచెందినట్టు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అలాగే.. చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన రాకం లింగమూర్తి (55) కరీంనగర్-2 డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా ఆదివారం బస్టాండ్కు వచ్చి బస్సు వద్దకు వెళ్తుండగా ఛాతీలో వొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే ఆర్టీసీ సిబ్బంది కరీంనగర్లోని ప్రైవేట్ దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు.