హైదరాబాద్ : మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రపై ఈడీ, ఐటీదాడులు దుర్మార్గమని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, జాజుల సురేందర్తో కలిసి టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. మునుగోడులో ఇద్దరు నేతలు టీఆర్ఎస్ గెలుపునకు కృషి చేశారని, అందుకే బీజేపీ టార్గెట్ చేసిందని ఆరోపించారు. బీసీల వ్యతిరేక పార్టీ బీజేపీ అని మరోసారి రుజువైందన్నారు.
బీజేపీ డీఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉందని, బీసీలకు మండల్ కమిషన్ రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే బీజేపీ కమండల్ యాత్రతో దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. టీఆర్ఎస్ నుంచి బీసీ నేతలను దూరం చేసే కుట్రకు బీజేపీ పాల్పడుతోందని, ఆ కుట్రలకు లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బీజేపీ చేష్టలను గట్టిగా ప్రతిఘటించి తీరుతామన్నారు. బీసీ గణన చేయమంటే చేయరని.. బీసీ మంత్రిత్వ శాఖ వేయరని.. కానీ బీసీ నాయకుల వేధిస్తారా? అని నిలదీశారు.
బీజేపీ ఆటలో తెలంగాణలో సాగవని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఈడీ, ఐటీలకు బీజేపీ తప్ప ఇతర పార్టీల నేతలే కనిపిస్తున్నారని.. బీసీ నేతలు ఆత్మగౌరవంతో బతికేవారని.. అందుకే బీజేపీ వారిని దెబ్బతీయాలని చూస్తోందని మండిపడ్డారు. టీఆర్ఎస్ విజయాన్ని తట్టుకోలేకే బీజేపీ దాడులు చేయిస్తోందని, రాజకీయంగా బీసీలను తొక్కే కుట్ర బీజేపీదని ఆరోపించారు. బీజేపీ ఆటలు సాగనివ్వమని.. బీసీలపై చేస్తున్న దాడులను దేశం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
అవసరమైతే బీఆర్ఎస్ ఇతర పార్టీలను కలుపుకొని ఈడీ, ఐటీ దాడులపై పోరాటం చేస్తుందన్నారు. తమ కులం నేతలను బీజేపీ కావాలనే టార్గెట్ చేస్తోందని, బీజేపీకి బీసీల మద్దతు దక్కదన్నారు. అమిత్ షా కళ్లు తెరవాలని.. బీజేపీ కుట్రలు ఆపకపోతే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని స్పష్టం చేశారు. బీజేపీపై పోరాడే సత్తా ఉన్న బలమైన నేత కేసీఆర్ అని.. అందుకే టీఆర్ఎస్ను ఈడీ, ఐటీలతో బలహీనపరిచే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.
బీసీ వ్యాపారవేత్తలను రాజకీయంగా ఎదగకుండా బీజేపీ కుట్ర చేస్తోందని ఎమ్మెల్యే జాజుల సురేందర్ విమర్శించారు. గంగుల కమలాకర్, రవిచంద్ర రాజకీయాల్లోకి రాక ముందు నుంచే వ్యాపారాల్లో ఉన్నారని, బీజేపీ వ్యాపారస్తులు ఈడీ, ఐటీలకు కనిపించరా? అని ప్రశ్నించారు. మునుగోడు ఓటమిని బీజేపీ జీర్ణించుకోలేక పోతోందని, బీసీలకు ఏ మేలు చేసిన పాపాన బీజేపీ పోలేదన్నారు.
మున్నూరు కాపులతో పాటు అన్ని వర్గాలను ఆదుకుంటున్న ఏకైక నేత కేసీఆర్ అన్నారు. కేసీఆర్కు బీసీల మద్దతును బీజేపీ ఓర్వడం లేదని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పదిశాతం పెంచారు సరే.. మరి బీసీ జనగణన ఎప్పుడు చేస్తారంటే కేంద్రం ఏం చెప్పదని మండిపడ్డారు. కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్న బీజేపీకి బుద్ధి చెబుతామని, కేసీఆర్ పాలనలో బీసీలు ఎదగడం బీజేపీకి ఇష్టం లేదన్నారు. బీజేపీ డై వర్షన్ రాజకీయాలు చేస్తోందని, గంగుల, రవిచంద్రలపై ఈడీ, ఐటీదాడులను ఖండిస్తున్నామన్నారు.