జనగామ : జిల్లా పరిధిలోని చిల్పూర్ మండలం కొండాపూర్ వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ఆర్టీసీ హుస్నాబాద్ నుంచి జగద్గిరిగుట్ట వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటానస్థలికి చేరుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు(AP 29 Z 2500) హుస్నాబాద్ డిపోకు చెందినది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.