కాగజ్నగర్, జూలై 5 : రైతుల కన్నీళ్లు తుడువడానికి కన్నెపల్లి పంప్హౌస్కు వెళ్తు న్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను అడ్డుకోవడం దుర్మార్గమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మండిపడ్డారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లోని ఓ ఫంక్షన్హాల్లో 120 మంది విద్యార్థులకు అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ సహకారంతో స్వేరోస్ ఆధ్వర్యంలో రూ.కోటి స్కాలర్షిప్లను ఆదివా రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రా ప్రాజెక్టులు నింపడానికి రేవంత్ కన్నెపల్లి పంప్హౌస్ బంద్ చేయిస్తున్నాడని విమర్శించారు.
చంద్రబాబు, బీజేపీ సాయంతో తెలంగాణను దోచుకోవాలని చూస్తున్న రేవంత్ కుట్రల ను కేటీఆర్ అడ్డుకుంటున్నారని పేర్కొన్నా రు. బీఆర్ఎస్ నేతలు కన్నెపల్లి ప్రాజెక్టును ధ్వంసం చేయడానికి వెళ్లలేదని, నీరెందు కు ఇవ్వడం లేదని చూడటానికి మాత్రమే వెళ్లారని స్పష్టంచేశారు. రైతులకు నీరు, విత్తనాలు యూరియా, నిరుద్యోగులకు ఉద్యోగాలు, కాంట్రాక్టర్లకు డబ్బులు రావడం లేదని, మన సొమ్ము ఇతర రాష్ర్టాలకు చెందిన వారికి దోచిపెడుతున్నారని ఆరోపించారు. రేవంత్ తనను చంపాలని కుట్ర చేస్తున్నారని, తన కుటుంబాన్నీ వదలడం లేదని మండిపడ్డారు.