RS Praveen Kumar | హైదరాబాద్ : చిత్రపురి సిటీలో రూ. 3 వేల కోట్ల భూదందా జరిగిందని ఆరోపణ వస్తే ఆధారాలతో స్పందించాల్సింది పోయి దౌర్జన్యంగా అక్రమ కేసు పెట్టి, సెల్ఫోన్ను సీజ్ చేయడం ఏంటి రేవంత్ రెడ్డి గారు అని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. అంటే కుంభకోణం బరాబర్ జరిగిందన్న మాట. దాని నుండి ప్రజల దృష్టి మరల్చడానికే తమ యువనేత, తెలంగాణ పోరాట యోధుడు మన్నె క్రిశాంక్ ఫోన్ సీజ్ చేశారు. దీన్నే పోలీసు భాషలో Attention Diversion MO అంటరు. ఈ గ్యాంగ్లు బ్యాంకుల ముందు తచ్చాడుతూ ఖాతాదారుల మీద రంగు చల్లి వాళ్ల పైసలనెత్తుకొని పారిపోతారు. ఈ గ్యాంగ్లు నేడు తెలంగాణలో రాజ్యమేలుతున్నవి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
కుంభకోణం జరిగిందని ఆరోపణ వస్తే ఆధారాలతో స్పందించాల్సింది పోయి దౌర్జన్యంగా అక్రమ కేసు పెట్టి సెల్ ఫోను సీజ్ చేయడమేంది @revanth_anumula గారు??
అంటే కుంభకోణం బరాబర్ జరిగిందన్న మాట. దాని నుండి ప్రజల దృష్టి మరలించడానికే మా యువ నేత, తెలంగాణ పోరాట యోధుడు @Krishank_BRS ఫోను సీజ్ చేశారు.… https://t.co/KFjLIgNIOX— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) March 21, 2024