శంకర్పల్లి/శంకర్పల్లి రూరల్, జూలై 11: బాధిత కుటుంబీకులను పరామర్శించేందుకు షాబాద్ వెళ్తుండగా మధ్యలో పోలీసులు అరెస్టు చేయడం ఏమిటని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మండిపడ్డారు.
ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, నరేందర్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అసమర్థ పాలన సాగుతున్నదని, ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అక్రమ అరెస్టులు చేయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిందితుడు పరారీలో ఉంటే రాష్ట్రంలో పోలీస్, నిఘా వ్యవస్థలు ఏం చేస్తున్నాయని, శాంతిభద్రతల నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఘటనకు సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగేవరకు పోరాడుతామని చెప్పారు.