హైదరాబాద్: ప్రతి మండలంలో అధునాతన సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ (Telangana Public Schools) ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి భట్టివిక్రమార్క ప్రకటించారు. కాలేజీ స్థాయిలో ఉద్యోగానికి అవసరమైన మేరకు కోర్సులను ప్రవేశపెట్టి పోటీ ప్రపంచంలో తెలంగాణ విద్యార్థులు నెగ్గుకురాగల సమర్థతను సమకూరుస్తామన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందులో పైలెట్ ప్రాజెక్టుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు రూ.500 కోట్లు ప్రతిపాదించారు.
ఇక విద్యా రంగానికి రూ.21,389 కోట్లు ప్రతిపాదించారు. ఇందులో విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను ప్రోహించేందుకుగాను మౌలిక సదుపాయాల కల్పనకు రూ.500 కోట్లు కేటాయించారు. ఉన్నత విద్యామండలిని ప్రక్షాళనల చేసి హయ్యర్ ఎడ్యుకేషన్లో ప్రమాణాలను మెరుగుపరుస్తామని చెప్పారు.