హైదరాబాద్, మార్చి 7 : రైతులకు రైతుబీమా తరహాలోనే, నేత కార్మికులకు రూ.5 లక్షల బీమా సదుపాయాన్ని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బడ్జెట్లో ప్రతిపాదనలు చేసింది. రైతు బీమా పథకం కింద గుంట భూమి ఉన్న రైతు మరణించినా, బాధిత కుటుంబానికి వారంలోనే బీమా మొత్తం రూ.5 లక్షలు అందిస్తున్నది. ఈ బీమా పథకానికి రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తున్నది. అదే తరహాలో నేత కార్మికులకు సైతం బీమా పథకాన్ని తీసుకురాబోతున్నది. ఆ పథకాన్ని 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభించాలని సంకల్పించింది.
రాష్ట్రవ్యాప్తంగా నేత కులవృత్తిపై ఆధారపడి లక్ష మంది వరకు జీవనం సాగిస్తున్నారు.
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఆ కార్మికులందరికీ లబ్ధి చేకూరనున్నది.