ముకరంపుర, ఆగస్టు 20: జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. కరీంనగర్ నగరంలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ వరింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజేహెచ్-143) కార్యవర్గ సమావేశానికి హాజరై మాట్లాడారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటుందని చెప్పా రు. ఇప్పటివరకు కరోనా బాధితుల ఖాతా ల్లో రూ.5.36 కోట్లు జమ చేశామని తెలిపా రు. మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల చొప్పున అందజేశామని చెప్పారు. 3,200 మందికిపైగా జర్నలిస్టులకు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు సాయం చేసినట్టు వెల్లడించారు. మరణించిన జర్నలిస్ట్ కుటుంబాలకు సాయం కోసం ఈ నెల 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించా రు. టీయూడబ్ల్యూజే-143 కరీంనగర్ జి ల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన బోనాల మల్లికార్జున్ను అభినందించారు. కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు ఆసాని మారుతీసాగర్, ఇస్మాయిల్, బిజిగిరి శ్రీనివాస్, లాయక్ పాషా, గంగుల రాంగోపాల్, వేణుగోపాల్రావు తదితరులు పాల్గొన్నారు.