జోగులాంబ గద్వాల : రాబోవు నాలుగేండ్లలో దళితుల అభివృద్ధి కోసం ప్రభుత్వం విడతల వారీగా రూ.40 వేల కోట్లు ఖర్చు చేయనుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నాగర్ కర్నూలు ఎంపీ రాములుతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం దళితులకు చేయూత నివ్వడానికి దళిత సాధికారత పథకం ప్రవేశపెట్టిందన్నారు. దళితులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి పూచీకత్తు లేకుండా వారికి రూ.10 లక్షలు రుణం అందిస్తుందని పేర్కొన్నారు.
దళిత ఉద్ధరణ ద్వారానే సమాజం బాగుపడుతుందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహం తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఎలుకలు 12 బాటిళ్ల మద్యం తాగేశాయ్!
పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి హరీశ్రావు
దళిత వాడలో పల్లె నిద్ర చేసిన ఎమ్మెల్యే ఆనంద్
ఒలింపిక్స్కు భారీ టీమ్ను పంపనున్న చైనా
వెదజల్లే పద్ధతితో అధిక దిగుబడి : మంత్రి అల్లోల