హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పురపాలక సంఘాలకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా సహాయం అందించేందుకు రూ.25 కోట్లు విడుదల చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేసింది. ఈ నిధుల ఖర్చుకు సంబంధించిన వివరాలను, వినియోగ ధ్రువీకరణ పత్రాలను అకౌంటెంట్ జనరల్కు, ప్రభుత్వానికి సమర్పించాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ టీకే శ్రీదేవి తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
పంచాయతీలకు రూ.256 కోట్లు
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఆర్థిక శాఖ మంగళవారం రూ.256 కోట్లు విడుదల చేసింది. కేంద్రంలోని 15వ ఆర్థిక సంఘం నుంచి విడతలవారీగా వస్తున్న మొత్తాలను రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు అందజేస్తున్నది. అందులో భాగంగానే రెండో విడతగా రూ.256 కోట్లు విడుదల చేసినట్టు ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు.