హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.177 కోట్లు కేటాయించింది. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ద్వారా అమలయ్యే పలు పథకాలకు వీటిని ఇవ్వనున్నది. అందులో విద్యార్థుల విదేశీ విద్యకు సంబంధించి వివేకానంద ఓవర్సీస్ పథకం, వేద పాఠశాలలకు ఫైనాన్స్ అసిస్టెన్స్, వేద పండితుల గౌరవ వేతనం, వేద విద్యార్థులకు ైస్టెపెండ్, సంప్రదాయ పాఠశాలలకు ఫైనాన్స్ అసిస్టెన్స్, బ్రాహ్మిణ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కీమ్ ఆఫ్ తెలంగాణ(బెస్ట్) తదితర పథకాలు ఇందులో ఉన్నాయి. అటు.. దేవాదాయ శాఖకు 2022-23లో ప్రభుత్వం రూ.368.75 కోట్లు కేటాయించింది. గతేడాదితో పోల్చుకొంటే ఇది రూ.10 కోట్లు అదనం.