హైదరాబాద్ : చెన్నూరు ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరయ్యాయి. పథకానికి రూ.1,658 కోట్లతో పరిపాలనా అనుమతులను ప్రభుత్వం జారీ చేసింది. ఇటీవల సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో చెన్నూరు ఎత్తిపోతల పథకానికి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా పరిపాలన ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పథకానికి లక్ష్మీ, సరస్వతి, పార్వతీ జలాశలయాల నుంచి మూడు ఎత్తిపోతల పథకాలకు పది టీఎంసీల నీటిని ఎత్తిపోయనున్నారు. దీంతో నియోజకవర్గంలోని 90వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ధన్యవాదాలు తెలిపారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకానికి నిధులు మంజూరయ్యాయి. ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.1,850 కోట్లను ఒకేసారి ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ పరిపాలనా ఉత్తర్వులను జారీ చేసింది.