యాదగిరిగుట్ట, జూలై 24: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా అధికారులు మరిన్ని చర్యలు చేపడుతున్నారు. భక్తులు మాఢవీధుల నుంచి రూ.150 దర్శనానికి వెళ్తున్న సమయంలో ఎండా, వానతో ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన ఆలయాధికారులు రూ.150 ప్రత్యేక దర్శన లైన్కు కొండపైన బస్బే పక్కన గల క్యూ కాంప్లెక్స్ నుంచి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఈ క్యూలైన్ను సోమవారం నుంచి అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ఈ క్యూలైన్పై ట్రయల్ రన్ చేపట్టారు. మూడు రోజుల పాటు పరిశీలించి మార్పులు చేర్పులు చేపట్టనున్నట్టు ఆలయాధికారులు తెలిపారు. యాదగిరిగుట్ట మండలానికి చెందిన స్వామివారి భక్తులకు ప్రతి శనివారం ఉదయం 7 గంటల నుంచి 8.45 గంటల వరకు ఉచిత దర్శనం కల్పిస్తున్నామని, స్థానిక భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.