హైదరాబాద్ : ఎనిమిదో విడుత రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ నిరాటంకంగా సాగుతున్నది.మూడో రోజు 1,051,384 మంది రైతుల ఖాతాల్లో రూ.13,020,657,990 కోట్లు జమ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. మూడు రోజుల్లో 4,595,167 మంది రైతులకు రూ.31,020,432,279 రైతుబంధు సాయం అందించామన్నారు. ఈ యాసంగి సీజన్లో 66.61లక్షల మంది రైతులకు రూ.7,645.66కోట్లు రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందించనున్నది.
ఈ నెల 28న నుంచి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నది. తొలి రోజు ఎకరం, మరుసటి రోజున రెండెకరాలున్న, ఆ తర్వాత మూడెకరాలున్న వారికి సాయం అందజేస్తున్నది. వ్యవసాయ పొలం విస్తీర్ణం ఆధారంగా డబ్బులు అందజేస్తూ వస్తున్నది. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ సాగుకు సహకారమే కేసీఆర్ లక్ష్యమన్నారు. మిగతా రైతులకు విడుదల వారీగా పెట్టుబడి అందిస్తామన్నారు.