హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 4 (నమస్తే తెలంగాణ)/మారేడ్పల్లి: మూడేండ్లలో 12.89 లక్షల పాస్పోర్టులు జారీ చేసినట్టు రీజినల్ పాస్పోర్టు అధికారి దాసరి బాలయ్య తెలిపారు. 2019లో 5.54 లక్షలు, 2020లో 2.93 లక్షలు, 2021లో 4.42 లక్షల పాస్పోర్టులతో పాటు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్లను జారీ చేసినట్టు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 4 పాస్పోర్టు కేం ద్రాలు, ఒక పాస్పోర్టు లఘు సేవా కేంద్రం, 14 పోస్టాఫీస్ పాస్పోర్టు సేవా కేంద్రాల్లో పారదర్శకంగా సేవలు అందజేస్తున్నట్టు పేర్కొన్నారు. చేశారు. త్కాల్ స్కీం కింద మూడు పనిదినాల్లోనే పాస్పోర్టులు అందజేశామని వార్షిక నివేదికలో వెల్లడించారు.