హైదరాబాద్: అనారోగ్యంతో కన్నుమూసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య (Rosaiah) భౌతికకాయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్కు (Gandhi Bhavan) తరలించారు. అభిమానులు, పార్టీ కార్యకర్తల సందర్శనార్ధం మధ్యాహ్నం 12.30 గంటల వరకు అక్కడే ఉంచనున్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దూతగా మల్లికార్జున ఖర్గే నివాళులర్పించనున్నారు.
అనంతరం గాంధీభవన్ నుంచి రోశయ్య అంతిమ యాత్ర ప్రారంభంకానుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు కొంపల్లిలోని ఫామ్హౌస్లో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.