న్యూఢిల్లీ, జూన్ 10: మధ్యప్రదేశ్ నుంచి మీనాక్షి నామినేషన్ తిరస్కరణకు గురైన అంశాన్ని కాంగ్రెస్ బుధవారం ఎన్నికల కమిషన్ దృష్టికి తీ సుకువెళ్లింది. ఆ నిర్ణయం అభ్యంతరకరమైదని, వెంటనే రద్దు చే యాలని కోరింది. మీనాక్షితోపాటు కేసీ వేణుగోపాల్, జైరామ్ రమేశ్, అభిషేక్ సింఘ్వీ, వివేక్ టంఖా, రణదీప్ సుర్జీవాలా, భూపేశ్ బఘే ల్, పార్టీ అగ్రనాయకుల ప్రతినిధి బృందం ఎన్నికల కమిషన్ను కలుసుకుని తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండు చేసింది. ‘ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. రాజ్యాంగబద్ధ సంస్థలపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. అందుకే మేము ఈ పోరాటం చేస్తున్నాం’ అని మీనాక్షీ నటరాజన్ వి లేకరులతో చెప్పారు. ఈసీతో సమావేశం వివరాలను అభిషేక్ సింఘ్వీ విలేకరులకు తెలియచేస్తూ ‘ప్రతినిధి బృందం ఈసీకి సమగ్రమైన వినతిపత్రాన్ని సమర్పించింది. ’ అని సింఘ్వీ చెప్పారు.