చందూర్, జూన్ 6: వినూత్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ దేశానికే రోల్మాడల్గా నిలుస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా చందూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. 20 డబుల్ బెడ్రూం ఇండ్లు, వివిధ కుల సంఘాల కమ్యూనిటీ హాళ్లు, సీసీ రోడ్డు, క్రీడా మైదానాన్ని ప్రారంభించారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో రూ.800 కోట్లతో పింఛన్లు ఇస్తే.. ప్రస్తుతం మన తెలంగాణలో రూ.12 వేల కోట్లు చెల్లిస్తున్నామని చెప్పారు. రైతులు వరి కాకుండా ఇతర పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ఆయిల్పామ్ సాగు చేస్తే ప్రభుత్వం సబ్సిడీ అందిస్తున్నదని తెలిపారు.