హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): శ్రీచైతన్య ఇన్ఫినిటీ లెర్న్ ప్రచారకర్తగా టీమిండియా బ్యాటర్ రోహిత్శర్మ నియమితులయ్యారు. ఈ మేరకు శ్రీచైతన్య విద్యాసంస్థతో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు. రోహిత్శర్మ ఆధ్వర్యంలో ఇన్ఫినిటీ లెర్న్ సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని ఆశిస్తున్నట్టు ఆ సంస్థ ఫౌండర్, డైరెక్టర్ సుష్మ బొప్పన, సీఈవో ఉజ్వల్సింగ్ తెలిపారు.