నిజామాబాద్: జిల్లాలోని ధర్పల్లిలో దొంగల ముఠా బీభత్సం సృష్టించింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ధర్పల్లిలో ఉన్న పెట్రోల్ బంకుపై దుండగులు రాళ్లతో దాడిచేశారు. అనంతరం పెట్రోల్ బంకులో ఉన్న రూ.40 వేలు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నగర సీపీ నాగరాజు పెట్రోల్ బంకును పరిశీలించారు. ఈ ఘటపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. బంకులో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.