సంగారెడ్డి: జహీరాబాద్లో (Zaheerabad) అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలోని మార్కెట్ ఏరియాలో ఉన్న ఐదు బట్టల దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. దీంతోపాటు మరో నాలుగు మద్యం షాపుల్లో దొంగతనం చేశారు. షెట్టర్లు పగలగొట్టి షాపుల్లో ఉన్న నగదు, విలువైన సామగ్రి ఎత్తుకెళ్లారు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.