హనుమకొండ, జూలై 20: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బియ్యం సేకరణలో కొర్రీలు పెట్టడంతోపాటు అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల రైస్మిల్ పరిశ్రమ రోడ్డున పడిందని ఉమ్మడి వరంగల్ జిల్లా రైస్మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు ఆరోపించారు. 48 రోజుల నుంచి ఎఫ్సీఐ సీఎంఆర్ సేకరణను నిలిపేయడంతో మిల్లులు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో యజమానులు, మిల్లు ఉద్యోగులు, హమాలీలు, కార్మికులు ఆందోళనకు దిగారు. వెంటనే బియ్యం సేకరణ ప్రారంభించాలని, జరిగిన నష్టాన్ని పూడ్చాలని డిమాండ్ చేస్తూ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండలోని ఏకశిలా పార్కు నుంచి వరంగల్ కలెక్టరేట్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా రైస్మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. కేంద్రం బియ్యం సేకరించే విషయంలో పంతాలకు పోయి ఇబ్బందులు స్పష్టిస్తున్నదని ఆరోపించారు.
సేకరణ నిలిపేయడంతో రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్ల వద్ద వానకాలానికి 30 లక్షల టన్నులు, యాసంగికి సంబంధించిన సు మారు 50 లక్షల టన్నుల వడ్లు పేరుకుపోయాయని తెలిపారు. కేంద్రం ఆకస్మికంగా బియ్యం సేకరణ నిలిపివేయడంతో రాష్ట్రం లో వెయ్యి బాయిల్,్డ 2500 రా రైస్ మిల్లులు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. భారీవర్షాలకు ధా న్యం తడిసి మొలకలు వచ్చాయని తెలిపారు. బియ్యం సేకరణ తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
కేంద్రం నిర్లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 లక్షల టన్నుల ధాన్యం తడిసిపోయిందని, ఈ నష్టానికి మిల్లర్లను బాధ్యులు చేయొద్దన్నారు. పలు డిమాండ్లతో కూడిన వినతి ప త్రాన్ని కలెక్టర్, అదనపు కలెక్టర్కు అందజేశారు. ఆం దోళనలో వరంగల్ జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి గోనెల రవీందర్, కోశాధికారి తకెళ్లపల్లి యుగంధర్, జిల్లా ఉపాధ్యక్షులు దుబ్బా రమేశ్, మాధవశంకర్, రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షుడు దేవునూరి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.