నిజామాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. మోదీ ఈ దేశానికి పట్టిన శని అని ధ్వజమెత్తారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత దేశాన్ని ఏలినవారిలో ఇంతటి అసమర్థ ప్రధానిని ప్రజలెప్పుడూ చూడలేదని ఎద్దేవా చేశారు.
ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేటలో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో స్థానిక ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావుతో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ పాలనలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ‘5జీ స్పెక్ట్రం వేలంలో లక్షల కోట్ల కుంభకోణం జరిగింది. తన మిత్రుడు అదానీకి మేలు చేసేందుకు ఆస్ట్రేలియా బొగ్గు దిగుమతి పేరుతో రూ.3 వేలకు దొరిగే బొగ్గును రూ.30 వేలకు కొనాలని విద్యుత్తు డిస్కంలకు హుకుం జారీ చేశారు. ఇందులో రూ.3 లక్షల కోట్ల కుంభకోణం జరిగింది’ అని ధ్వజమెత్తారు.
బండి సంజయ్ ఓ అజ్ఞాని అని మంత్రి వేముల ఎద్దేవా చేశారు. తెల్లారితే కేసీఆర్ను విమర్శించే బండి సంజయ్కి అసలు కేసీఆర్ పేరు ఎత్తే అర్హత లేదని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందని, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా ఇలాంటివి ఉన్నాయోమే చూపించాలని డిమాండ్ చేశారు. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధిని తమకు వదిలేయాలని, జీవన్రెడ్డిని మళ్లీ ఆశీర్వదించాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.