ఖమ్మం జిల్లాలోని ఐదు ప్రధాన రహదారులను నాలుగు లేన్లుగా విస్తరించేందుకు ప్రభుత్వం రూ.594 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. హైబ్రిడ్ యాన్యుటీ మాడల్ (హ్యామ్)లో పనులు చేపట్టనున్నారు.
594 కోట్లు మంజూరు
హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ఖమ్మం జిల్లాలోని ఐదు ప్రధాన రహదారులను నాలుగు లేన్లుగా విస్తరించేందుకు ప్రభుత్వం రూ.594 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. హైబ్రిడ్ యాన్యుటీ మాడల్ (హ్యామ్)లో పనులు చేపట్టనున్నారు.
విస్తరించనున్న రహదారులు
వైరా నుంచి జగ్గయ్యపేట వరకు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని కలుపుతూ నాలుగు వరుసల రహదారిగా విస్తరణ. జగ్గయ్యపేట , బోనకల్ , రావినూతల , ముజఫర్నగర్, జానకీపురం, పెద్ద బీరవల్లి, పాలడుగు, సీతానగరం, గొల్లపూడి, రెబ్బవరం, తాటిపూడి, జింకల తాండా, సోమవరం మీదుగా వైరా వరకు. పొడవు- 25.2కి.మీ.లు కాగా, మంజూరైన నిధులు రూ. 151.20 కోట్లు.
మధిర నుంచి తూటికుంట్ల వరకు. మధిర, జిలుగుమాడు, ఆతూరు, కిష్టాపురం, సిరిపురం, కలకోట, బ్రాహ్మణపల్లి మీదుగా తూటికుంట్ల వరకు. పొడవు-13.50 కి.మీ.లు. నిధులు రూ. 81 కోట్లు.
మధిర నుంచి ఎర్రుపాలెం వరకు. మధిర, ఎల్లెందుల పాడు, దెందుకూరు, మీనవోలు మీదుగా ఎర్రుపాలెం వరకు. పొడవు-18.40 కిలోమీటర్లు. నిధులు రూ. 110.40 కోట్లు.
ఖమ్మం నుంచి బోనకల్ వరకు. ఖమ్మం, కొత్తూరు, దంసలాపురం, గాంధీనగరం, రామకృష్ణాపురం, పందిళ్లపల్లి, జగన్నాథపురం, నాగులవంచ, ముష్టికుంట్ల మీదుగా బోనకల్ వరకు. పొడవు- 28.03 కి.మీ. లు నిధులు రూ.157.23 కోట్లు.
బోనకల్-ఆళ్లపాడు, రాయన్నపేట-వంగవీడు వరకు. బోనకల్, ఆళ్లపాడు, రాయన్నపేట మీదుగా వంగవీడు వరకు. పొడవు-15.72 కి.మీ.లు. నిధులు రూ.94.32 కోట్లు.