Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలో రోడ్ల విస్తరణను తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) భారీగా చేపట్టింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 24,245 కిలోమీటర్ల మేర రహదారులను విస్తరించారు. 2014లో కేసీఆర్( KCR ) అధికారం చేపట్టిన వెంటనే జరిపిన ఒక సమీక్ష సమావేశంలో ఈ విభాగాన్ని పటిష్టపరిచేందుకు ఒక బ్లూప్రింట్ను సిద్దం చేసి రోడ్ల అభివృద్ధి( Roads development ) కి ప్రణాళికను రూపొందించారు. మండల్ హెడ్ క్వార్టర్స్ నుండి జిల్లా హెడ్ క్వార్టర్స్కు డబుల్ లేన్ కనెక్టివిటీని విస్తరించారు. కొన్ని ప్రధాన జిల్లా రహదారులు, రాష్ట్ర రహదారుల యొక్క రెండు లేన్లకు విస్తరించడం ద్వారా సామర్థ్యం పెరిగింది. వంతెనల నిర్మాణం, రింగ్ రోడ్లు( Ring Roads ), ప్రధాన పట్టణాలకు బై పాస్ లైన్లు( By Pass lines ) విస్తరించారు.
2014 జూన్ మాసం నాటికి తెలంగాణ రాష్ట్రం యొక్క రోడ్ నెట్వర్క్ స్థితి జాతీయ సగటు కంటే తక్కువగా ఉండేది. మొత్తం రహదారి 24,245 కిలోమీటర్ల పొడవులో 28 శాతం మాత్రమే అనగా 6761 కిలోమీటర్ల నిడివి ఉండేది. రోడ్ల నాణ్యత ప్రమాణాలకనుగుణంగా లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంచి రహదారులు ఆర్థిక పురోగతికి కీలకం అనే వాస్తవాన్ని పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర రహదారులలో మెరుగైన రహదారి కనెక్టివిటీపై దృష్టి సారించింది. 2014 లో 2.25 కిలోమీటర్లు/100 చదరపు కి.మీ. ఉన్న జాతీయ రహదారి సాంద్రత ఇప్పుడు 2023 లో 4.45 కిమీ/100 చదరపు కిలో మీటర్లకు పెరిగింది. గత ఎనిమిదిన్నర సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో రోడ్ నెట్వర్క్ స్థితి 02-06-2014 నాటికి 6,093 కిలోమీటర్లగా ఉన్న డబుల్ లేన్ ఇప్పుడు 12,060 కిలోమీటర్లకు పెరిగింది. అదేవిధంగా నాలుగు లేన్ అంతకంటే ఎక్కువ 2014 లో 669 కిలోమీటర్లు మాత్రమే ఉండగా ఇప్పుడు 1154 కిలోమీటర్లకు పెరిగింది.
రాష్ట్రంలో రహదారి నెట్వర్క్ను పెంచడంలో ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. గత ఎనిమిదిన్నర సంవత్సరాలలో 8179 కిలోమీటర్ల నిడివి గల డబుల్ లేన్ రోడ్లు నిర్మించారు. 321 కిలోమీటర్ల ఫోర్ లేన్ రోడ్లు, 483 వంతెనలు పూర్తిచేసారు. ఈ విభాగాన్ని పటిష్టం చేసేందుకు ఇటీవలే పునర్వ్యవస్థీకరించి 410 కొత్తగా ఇంజనీర్ పోస్టులు మంజూరుచేశారు. దీంతో రోడ్లు, భవనాల విభాగంలో ఇంజనీర్లు, సిబ్బంది సంఖ్య 3371కు పెరిగింది.