హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఘటనలో తండ్రీకొడుకులు దుర్మరణం చెందారు. తుమ్మలోనిగూడ వద్ద సాగర్ రహదారిపై కారు – బైక్ ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న తండ్రీ కొడుకులు మృతి చెందారు. మృతులు మేడిపల్లి వాసులు ముచ్చర్ల రాములు (35), సోను (11)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.