సంగారెడ్డి : నారాయణఖేడ్ మండలం నిజాంపేట సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. జాతీయ రహదారిపై లారీ, బైక్ను ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో దంపతులు మృతి చెందారు. మృతులను కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం జలాల్పూర్కు చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.