సూర్యాపేట: సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాన్పహడ్ దర్గా సమీపంలో జాన్పహడ్ నుంచి శూన్యపహడ్ వెళ్లేదారిలో ఓ లారీ అదుపుతప్పి రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రి పాలెం గ్రామ సమీపంలోని జంకు తండాకు చెందిన భార్యాభర్తలుగా గుర్తించారు.
జంకు తండాకు చెందిన దనావత్ పున్యా (55), అతని భార్య దనావత్ మగ్తి (50) స్కూటీపై వెళ్తుండగా లారీ మృత్యువు రూపంలో వచ్చి కబలించింది. కాగా, ఈ ప్రమాదంలో మరణించిన మరో వాహనదారుడి వివరాలు తెలియాల్సి ఉంది.