మహదేవపూర్, ఆగస్టు 16 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబట్పల్లిలోని లక్ష్మీ బరాజ్కు వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత, గోదావరి వరద క్రమంగా పెరుగుతూ వస్తోంది.
సోమవారం బరాజ్కు ఇన్ఫ్లో 5,52,600 క్యూసెక్కుల వరద రాగా, మంగళవారం 8,68,850 క్యూసెక్కులకు పెరిగింది. బరాజ్లోని గేట్లన్నీ(85) ఎత్తి, అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు భారీ నీటి పారుదల శాఖ డీఈ సురేశ్ తెలిపారు.