ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రిమ్స్(RIMS)లో విద్యార్థులపై దాడికి పాల్పడిన ఘటనలో రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతి కుమార్(Assistant Professor Kranti Kumar)ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు(dismissed) డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ తెలిపారు. వైద్యుడు క్రాంతి కుమార్ అర్ధరాత్రి సమయంలో కారులో ముగ్గురు గుండాలను తీసుకొచ్చి విద్యార్థులపై దాడికి పాల్పడిన ఘటన దురదృష్టకరమన్నారు.
ఘటనకు సంబంధించి పూర్తి విచారణ జరుపుతున్నామని, ఐదుగురు సీనియర్ వైద్యులచే కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఐదు రోజుల్లో కమిటీ నివేదిక ఇస్తుందని బాధ్యులపై తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులపై దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. భద్రతా సిబ్బందిని పెంచుతున్నట్లు స్పష్టం చేశారు.