మహబూబ్ నగర్ : జిల్లాలోని సీసీ కుంట మండలం అమ్మాపూర్ గ్రామంలోని కురుమూర్తి జాతర, బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన ఉద్దాల కార్యక్రమంలో ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నే శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, సాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉద్దాల ఉత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి సుమారు రెండు లక్షలకు పైగా భక్తజనం హాజరయ్యారు. స్వామివారి యుద్ధాలకు భక్తులు పూజలు నిర్వహించారు. అంగరంగ వైభవంగా ఉద్దాలను కురుమూర్తి కొండపైకి తరలించారు.