పనికోసం ప్రయత్నించు.. పస్తులుండే పరిస్థితి వస్తే.. ఇక్కడ సంప్రదించు అనే అంశాన్ని తరచుగా చెబుతుంటారు దోసపాటి రాము. ఇతనో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి. కరోనా సమయంలో వలస కూలీలు, అనాథలు, వృద్ధులు, పేదలు పడిన ఇబ్బందులను గమనించారు. అటువంటి వారికి చేయూతనివ్వాలనే తలంపుతో నాలుగేండ్లుగా సేవలు చేస్తున్నారు. ‘నిరుపేదల ATM.. ఇది డబ్బులివ్వదు, అవసరాలు తీర్చుతుంది’ అనే అంశంతో చేయూతనిస్తున్నారు. నా అన్న వారే దూరం పెట్టే ఈరోజుల్లో.. తానున్నానంటూ ఆదుకుంటుండటం గొప్పవిషయం. ఆయన చేయూతతో ఎంతో మంది తమ బతుకులను తీర్చిదిద్దుకుంటున్నారు. అయితే ఆయన చేసే సేవలేంటో ఒకసారి తిలకిద్దాం.