హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం 11 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు, డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగ్లు ఇచ్చింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్మిట్టల్ శుక్రవారం జీవో 248ను జారీచేశారు.
పోస్టింగ్లు పొందిన వారిలో వైవీ గణేశ్, బీ హరిసింగ్, సురేశ్ కేశబోయిన, నాగలక్ష్మీ, వీ శ్రీదేవి, ఎస్ కిరణ్ప్రకాశ్, ఎన్ రాజేందర్రెడ్డి, ఎల్ రాజేందర్గౌడ్, షేక్ అహ్మద్, డీ రవీందర్, బీ శివాజీ ఉన్నారు. వీరికి పలు జిల్లాలతో పాటు హైదరాబాద్లో పోస్టింగ్లిచ్చారు.