హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): రెవెన్యూశాఖ మంత్రిపొంగులేటి శ్రీనివాస్రెడ్డిని రెవెన్యూ సంఘాల ప్రతినిధులు శనివారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, కోశాధికారి భాస్కర్రావు, సభ్యులు ముకుంద్రెడ్డి, భవానీశంకర్, చంద్రకళ, రఘురామశర్మ, ఉపేందర్రెడ్డి తదితరులు కలిశారు.
అసెంబ్లీ సమావేశాల అనంతరం సమావేశం నిర్వహించి సమగ్రంగా చర్చిస్తామని మంత్రి చెప్పినట్టు వారు తెలిపారు. రెవెన్యూ శాఖలో వివిధ స్థాయిలో పాలనను మరింత పటిష్టం చేయాలని మంత్రిని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే గౌతమ్కుమార్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు ఏనుగు నర్సింహారెడ్డి, విజయేందర్రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.