హైదరాబాద్, మార్చి 28(నమస్తే తెలంగాణ): రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ అక్రమంగా మైనింగ్(క్రషింగ్) చేసిన ట్టు అసెంబ్లీ సాక్షిగా స్వయంగా సీఎం రేవంత్ అంగీకరించారు. ఆయనతో పాటు మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెం కటస్వామి సైతం అంగీకరించారు. అ సెంబ్లీలో రాఘవ కన్స్ట్రక్షన్ చేసిన అక్రమాలను ఇద్దరు మంత్రులు స్వ యం గా వెల్లడించారు. సదరు కంపెనీ మంత్రి పొంగులేటి కుటుంబానిదేననే ఆరోపణలున్న నేపథ్యంలో ఒక మంత్రి కి సంబంధించిన కంపెనీ అక్రమాలను సీఎం సహా మైనింగ్ శాఖ మంత్రి ఒప్పుకోవడం సంచలనం రేపింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వంలో, కాంగ్రెస్ లో చర్చ జరుగుతున్నది. సీఎం రేవంత్ కల్పించుకొని మరీ రాఘవ కన్స్ట్రక్షన్ తప్పు చేసిందని వెల్లడించడమే గాక.. అనుమతులు లేకుండా క్రషర్ నడుతున్నట్టు తెలిపారు.
మైనింగ్ అండ్ జియాలజీ రంగారెడ్డి ఏడీ ఫిర్యాదు ఆధారం గా కంపెనీ నుంచి బకాయిలు వసూలు చేశామని తెలిపారు. సదరు కంపెనీ అక్రమంగా మైనింగ్ చేసిందని అంగీకరించడం గమనార్హం. అక్రమ క్రషింగ్పై రాఘవ కంపెనీకి నోటీసులు ఇచ్చినట్టు తనకు తెలియదని ఆ శాఖ మంత్రి వివే క్ చెప్పడం గమనార్హం. ఇప్పటివరకు రూ.1.22 కోట్లు, మరో అంశంలో రూ.1.52 కోట్ల బకాయిలను వసూలు చేశామని.. మరో రూ.4లక్షలు చెల్లించలేదని, ఈ మాత్రం దానికే ఇంత రా ద్ధాంతం చేస్తారా అంటూ ప్ర శ్నించారు. అక్రమ మైనింగ్పై నిగ్గుతేల్చేందుకు అసెంబ్లీ హౌస్కమిటీని వేయాలనే బీఆర్ఎస్ డిమాండ్ను కొట్టిపారేశారు. ‘ఈ చిన్న విషయానికే హౌస్ కమిటీకి ఒప్పుకొనేది లేదు. శాఖా పరమైన విచారణ చేస్తాం.. అందులో ఏమై నా తేలితే అప్పుడు హౌస్ కమిటీ వేస్తాం’ అంటూ మంత్రి ప్రకటించారు. మంత్రి అక్రమాలు ఎక్కడ ప్రజలకు తెలుస్తాయోననే హౌస్ కమిటీ వేసేందుకు సర్కార్ వెనుకంజ వేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు.